గ్రూప్-2 పరీక్ష మళ్ళీ వాయిదా
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో గ్రూప్-2 (TSPSC Group 2) పరీక్ష మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 2, 3న గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్ చేశారు. TSPSC Group 2 Exam ను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. టీఎస్పీఎస్సీ TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా Postponement of Group-2 Exam, కొత్త తేదీల ఖరారుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి కావడం Being the second time, గమనార్హం. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.
తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష test జరగాల్సి ఉంది. అయితే, అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ -2 పరీక్ష Group-2 Exam వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. వారి నుంచి వచ్చిన డిమాండ్లను పరిశీలనలోకి తీసుకున్న ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను Group-II Examination వాయిదా వేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వాయిదా వేయాలని నిర్ణయించినట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.