ఎల్లుండి స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపు
తెలంగాణ telangana News భారత్ ప్రతినిధి : నీట్ నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ చర్చించి న్యాయం చేయాలని కోరాయి.