తెలంగాణ మహాలక్ష్మిలకు ఫ్రీ బస్సు స్మార్ట్ కార్డులు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది రేవంత్ సర్కార్ ఇప్పటికే ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ మరో ఆలోచనకు శ్రీకారం చుట్టింది.ఉచిత ప్రయాణం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉచిత ప్రయాణ లబ్ధిదారులకు ఈ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది.
ఇప్పటి వరకు వివిధ వర్గాలకు అందజేస్తున్న బస్ పాస్ మాదిరిగానే ఈ మహాలక్ష్మి పథకంకు సంబంధించిన స్మార్ట్ కార్డులు కూడా జారీ చేస్తారు.వీటిని కూడా మరింత స్మార్ట్గా మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.