త్వరలో హైదరాబాద్లో భారీ ప్లాజా బిల్లింగ్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ రాయదుర్గం లోని నాలెడ్జ్ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసీ ఆధ్వర్యంలో టిస్క్వేర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు టీజీఐఐసీ టెండర్లు ఆహ్వానించింది. మధ్య దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా టిస్క్వేర్ నిర్మాణం ఉండాలని నిర్ణయించారు. రోజువారి పనులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి టిస్క్వేర్లో జరిగే ఈవెంట్లతో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని భావిస్తున్నారు. టీస్క్వేర్ నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా మారనుంది. ఇప్పటివరకూ పలువురి సెలబ్రిటీల బర్త్ డేలు, మూవీ అప్డేట్స్ను టైమ్ స్క్వేర్లో ప్రదర్శించే వాళ్లు. ఇప్పుడు హైదరాబాదులో నిర్మించబోతున్నారు.