రైల్వేలో భారీగా ఉద్యోగాలు 10 వేల అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పీ) పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీ నుంచి మే 11 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 9970
పోస్టు: అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పీ)
ఆర్ఆర్బీ రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు: సికింద్రాబాద్–1500, రాంచీ– 1213, భువనేశ్వర్– 928, అజ్మీర్– 820, ముంబయి– 740, కోల్కతా–720, భోపాల్– 664, ప్రయాగ్ రాజ్ –588, బిలాస్ పూర్–568, అహ్మదాబాద్–497, చండీగఢ్–433, మాల్దా–432, చెన్నై–362, తిరువనంతపురం–148, గోరఖ్పూర్–100, సిలిగురి–95, ముజఫర్ పూర్–89, పట్నా–33, గువాహటి–30, జమ్మూకశ్మీర్–08.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత ట్రేడ్లో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు. 2025, జులై 1 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 12.
అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 11.
అప్లికేషన్ ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు ఫీజు రూ.250.
సెలెక్షన్ ప్రాసెస్....
ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్–2025 ఉద్యోగానికి ఎంపిక కావాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–2, సీబీఏటీ(సైకో టెస్ట్)లోఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. సీబీటీ–1, సీబీటీ–2లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్(పదో తరగతి స్థాయి), జనరల్ అవేర్ నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, బేసిక్ సైన్స్, ఇంజినీరింగ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
సీబీటీ–1 ఎగ్జామ్ ప్యాటర్న్....
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–1లో మొత్తం 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తారు. 60 నిమిషాల వ్యవధిలో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ (20 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 మార్కులు), జనరల్ సైన్స్ (20 మార్కులు), జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్(10 మార్కులు) నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు1 మార్క్. ప్రతి తప్పుడు జవాబుకు 1/3వ వంతు మార్కును కోత విధిస్తారు. సీబీటీలో క్వాలిఫై కావాలంటే అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ(ఎన్ సీఎల్) 30 శాతం, ఎస్సీ 30 శాతం, ఎస్టీ అభ్యర్థులు 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులు సీబీటీ–2కు ఎంపిక చేస్తారు.